కోనసీమ: జిల్లా వ్యాప్తంగా 33 కేంద్రాల్లో శుక్రవారం ఇంటర్ ప్రథమ సంవత్సర బోటనీ, హిస్టరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జనరల్, ఒకేషనల్ విభాగాల్లో మొత్తం 2,487 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 401 మంది గైర్హాజరు కావడంతో 86.11 శాతం హాజరు నమోదైందని అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షల్లో ఎక్కడా ఎటువంటి మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదన్నారు.