కోనసీమ: రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శిగా నియమితులైన కోన వెంకట శ్రీనివాసరావు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ శ్రేణులకు అండగా నిలవాలని జగన్ సూచించారు. కూటమి ప్రభుత్వం బనాయిస్తున్న తప్పుడు కేసుల నుంచి కార్యకర్తలకు న్యాయపరమైన రక్షణ కల్పించి, వారిలో భరోసా నింపాలని శ్రీనివాసరావుకు దిశానిర్దేశం చేశారు.