KDP: పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మాధవి రెడ్డి పేర్కొన్నారు. శనివారం కడప నగరంలోని 31వ డివిజన్ పరిధిలో పాత మహిళా పోలీస్ స్టేషన్ సమీపంలో ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ చేశారు. లబ్ధిదారులకు పింఛన్లను అందజేసి, వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.