TPT: బెంగుళూరుకు చెందిన ఓ సంస్థ ఆదివారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ఎండీ ప్రవీణ్ ఎస్. నాయర్ తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ పేష్కార్ రామకృష్ణకు విరాళం డీడీని అందజేశారు. అనంతరం దాత కుటుంబ సభ్యులకు రంగనాయక మండపంలో అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.