GNTR: తెనాలికి చెందిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసును సీబీఐ క్లోజ్ చేయడంపై ఆమె తల్లిదండ్రులు శంషాబాద్ బేగం, ఇక్బాల్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 27న ఆయేషా మీరా శరీర అవశేషాలను తిరిగి ఖననం చేయనున్నట్లు తెలిపారు. 18 ఏళ్లు పోరాటం చేసినా తమ కుమార్తెకు న్యాయం జరగలేదని, అదే రోజు సత్యం–న్యాయం–ధర్మాన్ని సమాధి చేస్తున్నట్టేనని వారు వేదనతో చెప్పారు.