KDP: విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు సైన్స్ ఫెయిర్ నిర్వహించడం ఎంతో అవసరమని తహసీల్దార్ తిరుమల బాబు తెలిపారు. సిద్ధవటంలోని శ్రీ సాయి హై స్కూల్లో శనివారం సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్ మాట్లాడుతూ.. సైన్స్ ఫెయిర్ ద్వారా విద్యార్థులు తమ సృజనాత్మకతను, పరిశోధనా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.