ATP: ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగి చాలా ప్రాంతాల్లో 40°C పైగా నమోదయ్యాయి. వచ్చే రెండు రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లకూడదని సూచించింది. నీరు ఎక్కువగా తాగడం, తలపై కవర్లు వాడటం, చిన్న పిల్లలను ఎండకు దూరంగా ఉంచాలని హెచ్చరించింది.