PPM: కురుపాం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ కంచుకోటగా మారాలని డీసీసీ అధ్యక్షుడు వంగల దాలినాయుడు పిలుపునిచ్చారు. గుమ్మలక్ష్మీపురం మండలం పి.లేవిడి జంక్షన్ వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలకు శ్రేణులు సిద్ధం కావాలని, ప్రతి ఇంటా కాంగ్రెస్ జెండా ఎగరాలని అన్నారు. మండల, పంచాయతీ కమిటీలను వేగవంతం చేయాలన్నారు.