KDP: ఒంటిమిట్ట సీఐగా పసుపుల వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఉమ్మడి కడప జిల్లాలో ప్రొద్దుటూరు, పోరుమామిళ్ల, రైల్వే కోడూరు, చిట్వేలి, రాజంపేట ప్రాంతాల్లో ఎస్సైగా సేవలు అందించిన ఆయన, రైల్వే కోడూరు రూరల్ సీఐగా కూడా విధులు నిర్వహించారు. ఆయన అనుభవంతో ఒంటిమిట్ట ప్రాంతంలో చట్టవ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.