SKLM: పలాస నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త వెంకన్న చౌదరి మందస మండలంలోని పలు పంచాయతీలలో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా పంచాయతీలలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గూర్చి చర్చించారు. రానున్న పంచాయితీ ఎన్నికలకు ఐకమత్యంగా పనిచేస్తూ ఎన్నికలకు సమాయత్తం కావాలని కోరారు. పంచాయతీలలో ఉన్న సమస్యలను గ్రామ అధ్యక్ష, కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు.