AKP: ఎలమంచిలి మున్సిపాలిటీలో ఆస్తి, ఖాళీ స్థలాల పన్నుల బకాయిలను ఒకేసారి చెల్లించిన వారికి 50 శాతం వడ్డీ రాయితీ గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లు మున్సిపల్ కమిషనర్ ప్రసాదరాజు తెలిపారు. అవకాశాన్ని పుర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత నెల 30వ తేదీ వరకు ఇచ్చిన గడువును పొడిగించిన విషయాన్ని ప్రజలు గమనించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.