HNK: ఐనవోలు మల్లికార్జున స్వామి వారి ఆలయాన్ని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని ప్రజలు కలకాలం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం స్థానిక ప్రజలతో మాజీ ఎమ్మెల్యే మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.