ఏలూరు రూరల్ మండలం కోమడ వోలు గ్రామంలో వివాహిత ఇవాళ ఆత్మహత్యకు పాల్పడింది. అరవల్లి నాగమణి (44) భర్త, పిల్లలతో కలిసి జీవిస్తుంది. ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలు నేపథ్యంలోని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. రూరల్ ఎస్సై జయ శర్మ ఐపీఎస్ అనుమానాస్పదగా మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.