E.G: ఉండ్రాజవరం గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మంత్రి కందుల దుర్గేష్ శనివారం అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మంత్రి కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.