AKP: భూసేకరణ జరుగుతున్న రాంబిల్లి మండలం వెంకయ్యపాలెం, గజరెడ్డి పాలెం, ఎం. చింతువ గ్రామాల్లో సీపీఎం బృందం ఇవాళ పర్యటించి రైతులను ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం సీపీఎం నాయకులు దేవుడు నాయుడు, సోమ నాయుడు మాట్లాడుతూ.. గూగుల్, రెన్యూ సోలార్ పరిశ్రమల ఏర్పాటు కోసం పచ్చని ప్రాంతాన్ని అధికారులు సర్వనాశనం చేస్తున్నారని విమర్శించారు.