PLD: వినుకొండ ఆర్టీసీ డిపో వద్ద ఎన్ఎంయూ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా జరిగింది. 12 డిపోలను ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులకు అప్పగించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. సంస్థే సొంతంగా బస్సులను కొనుగోలు చేసి, తమ సిబ్బందితో నడపాలని నేతలు శ్రీనివాసరావు, సౌభాగ్యరాజు డిమాండ్ చేశారు. విలువైన ఆర్టీసీ స్థలాలను ప్రైవేట్ పరం చేయొద్దన్నారు.