W.G: భీమవరం కలెక్టర్ కార్యాలయంలో PGRS కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ నాగరాణి అర్జీదారుల వద్ద నుంచి 198 అర్జీలను స్వీకరించినట్లు తెలిపారు. వచ్చిన అర్జీలను విచారించి బాధితులకు న్యాయం చేసి అర్జీలు రీ ఓపెన్ కాకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.