ELR: కూటమి ప్రభుత్వం మంగళవారం ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కొత్త ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్ బోర్డులో మొత్తం 16 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 13 మంది తెలుగుదేశం పార్టీకి చెందినవారికి స్థానం కల్పించారు. అలాగే జనసేన పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులకు, BJPకు చెందిన ఒకరిని కూడా ట్రస్ట్ బోర్డులో చేర్చారు.