ATP: రుద్రంపేట, తాడిమర్రి మండలాల వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) నూతన అధ్యక్షులు, సభ్యులు అనంతపురంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పరిటాల సునీతను మర్యాదపూర్వకంగా కలిశారు. రుద్రంపేట అధ్యక్షునిగా కాటిగానికాలువ శ్రీనివాసులు, తాడిమర్రి అధ్యక్షునిగా కునుకుంట్ల శ్రీనివాస్ రెడ్డి తమ సభ్యులతో కలిసి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.