ATP: అనంతపురంలో మంత్రి పయ్యావుల కేశవ్ను ఆయన చిన్ననాటి స్నేహితులు శనివారం కలుసుకున్నారు. వీరంతా 1969 నుంచి 1976 వరకు అనంతపురంలోని చర్చి పాఠశాలలో 1 నుంచి 7వ తరగతి వరకు కలిసి చదువుకోవడం విశేషం. చాలా కాలం తర్వాత కలిసిన మిత్రులను మంత్రి ఆప్యాయంగా పలకరించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.