KDP: లింగాల మండల వ్యాప్తంగా టమాటా ధరలు పతనం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం 15 కిలోల టమాటాల బాక్సు రూ.100లకు మించి పలకడం లేదు.ఈ ధరలతో కోత కూలీ కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. మరికొంత మంది రైతులు టమాటాను తోటల్లో కోయకుండానే అలాగే వదిలేశారు. ప్రభుత్వం టమాట పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.