ప్రకాశం: పామూరు పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడుపుతున్న ఆరు ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం నిర్వహించిన తనిఖీలలో భాగంగా సీఐ వినోద్ కుమార్ చర్యలు చేపట్టి, ఆరు ఆటోలను సీజ్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. ఆయన మాట్లాడుతూ.. రోడ్డు భద్రత కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.