NTR: విజయవాడ దుర్గగుడి పరిధిలోని కనకదుర్గానగర్ మరుగుదొడ్లలో గుర్తించిన మృతదేహం ఘటనపై ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. యాచకుడిగా భావిస్తున్న వ్యక్తి మృతి విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం వెలుగుచూసింది. దీనిని తీవ్రంగా పరిగణించిన EO శీనానాయక్ శానిటరీ ఇన్స్పెక్టర్ రజినీప్రియను తొలగించి, శానిటేషన్ ఏజెన్సీకి షోకాజ్ నోటీసులు జారీ చేసి, నలుగురిని తొలగించారు.