NDL: మహానంది మండలం తిమ్మాపురం జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు ప్రకృతి యాత్ర నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయుడు చింతకుంట్ల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఏపీ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో శుక్రవారం యాత్ర చేపట్టి విద్యార్థులను ఓంకారం క్షేత్రానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ప్రకృతి వనరుల ప్రాధాన్యం, పరిరక్షణపై అవగాహన కల్పించారు.