KKD: బోద్దవరం గ్రామానికి చెందిన అదారి జయశ్రీ వెంకట సత్య సాయి రేణుక (21) అదృశ్యంపై కేసు నమోదైనట్లు SI రామకృష్ణ గురువారం తెలిపారు. మార్చి 7న వివాహం జరగాల్సి ఉండగా.. ఐదు తులాలు బంగారం, వెండి, రూ. 50 వేల నగదుతో ఆమె కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. విశాఖలో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న రేణుక ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆందోళన చెందుతున్నారు.