కోనసీమ జిల్లాలో అన్నదాత సుఖీభవ, సీఎం కిసాన్ పథకాల ద్వారా అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతుకు లబ్ధి చేకూర్చడం జరుగుతుందని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఆయన అమలాపురంలో మీడియాకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా పలు పథకాల ద్వారా 1,34,829 మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.