పార్వతీపురం పట్టణంలోని 14 వార్డు గొల్ల వీధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఇవాళ ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పంపిణీ చేశారు. అనంతరం ఆయన లబ్ధిదారులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి నెల మొదటి తేదీన కూటమి ప్రభుత్వం పెన్షన్ల ఇస్తుందని తెలిపారు.