ఏలూరు ఎంపీ కార్యాలయంలో శుక్రవారం ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. జిల్లా దివ్యాంగుల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నేతలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేకులు కట్ చేసి సంబరాలు జరిపారు. ఏరియా ఆసుపత్రిలో రోగులకు పాలు, పళ్ళు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఆరోపణల నుంచి బయటకు వచ్చి ఎంపీ మళ్లీ ప్రజాసేవకు అంకితం కావాలని కోరారు.