CTR: చిత్తూరు కార్పొరేషన్లో జాతీయ రహదారుల పనుల నిమిత్తం ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. ఈ మేరకు పలమనేరు, బైరెడ్డిపల్లె, పెద్దపం జాణి, గంగవరం మండలాల సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులకు ప్రత్యామ్నాయ సరఫరా ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.