T20WC ఫైనల్లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత బౌలర్ అర్ష్దీప్ సింగ్ కివీస్ బ్యాటర్ డారిల్ మిచెల్పై బాల్ విసిరిన సంగతి తెలిసిందే. ICC రూల్స్ ప్రకారం ఒక ఆటగాడు ప్రత్యర్థిపై ప్రమాదకరమైన రీతిలో బంతిని విసరడం ‘క్రీడా స్ఫూర్తికి విరుద్ధం’గా పరిగణించబడుతుంది. దీంతో అర్ష్దీప్కు మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించే అవకాశం ఉంది.