BPT: అద్దంకిలోని బస్టాండ్ సెంటర్ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్ల ధరల పెంపుపై మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు మండల అధ్యక్షులు తంగిరాల వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. ఇరాన్పై దాడులను సాకుగా చూపి సిలిండర్ ధరలను పెంచడం సరికాదని అన్నారు. దీనివలన మధ్యతరగతి మహిళలు తీవ్ర ఇబ్బందులు పడతారని ఆయన పేర్కొన్నారు.