BHPL: జిల్లాలోని సింగరేణి ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని జి. ఒలీవియా గణిత విభాగంలో అద్భుత ప్రతిభ చాటింది. జనవరిలో జరిగిన యూనిఫైడ్ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ (UIMO)లో ఆల్ ఇండియా 4,406వ ర్యాంకు సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్ మారుతి తెలిపారు. ఈ సందర్భంగా HM ఝాన్సీ, కోఆర్డినేటర్ శ్రీనివాస్ విద్యార్థినిని అభినందించారు.