TPT: నాయుడుపేటలోని ZP బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం ప్రత్యేక గుర్తింపు శిబిరం నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ALIMCO ద్వారా వీల్చైర్లు, ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు వంటి సహాయ పరికరాలను అందించనున్నారని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.