కృష్ణా: యనమలకుదురు ఆలయంలో హుండీ కానుకల చోరీ జరిగింది. ఈ వ్యవహారంలో అర్చకులు గూడూరు రామలింగేశ్వర విద్యాసాగర్, బాలూరి పూర్ణచందర్రావు, ఆలయ సిబ్బంది కొండ్రాతి రోశయ్యలను పెనమలూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో అవనిగడ్డ జైలుకు తరలించారు. ఆలయ ఈవో పాత్రపై కూడా విచారణ జరుగుతోంది.