హర్యానాలోని గురుగ్రామ్ సిధ్రావాలిలో నిర్మాణం జరుగుతుండగా గోడ కూలి ఏడుగురు కార్మికులు అక్కడిక్కడే మృతిచెందారు. మరో నలుగురు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నిన్న రాత్రి జరిగినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.