SRD: మండల కేంద్రమైన కంగ్టి గిరిజన గురుకుల పాఠశాలలో సావిత్రిబాయి పూలే ఘనంగా వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు దేవేందర్ మాట్లాడుతూ.. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నారంటే అది సావిత్రిబాయి ఆనాడు వేసిన సాహసోపేతమైన పోరాటంతోనే సాధ్యమైందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సావిత్రిబాయి గురించి వివరించారు.