W.G: ఇలపర్రు సొసైటీ వద్ద రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తనయుడు వెంకట్ బుధవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా కేంద్రాల వద్దే ధాన్యం విక్రయించుకోవచ్చని సూచించారు. విక్రయించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని భరోసా ఇచ్చారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.