NLR: రంజాన్ మాసం ప్రారంభమై నేటితో 16 రోజులు పూర్తయింది. 16వ రోజు శుక్రవారం కావడంతో బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పట్టణంలోని మసీదులకు స్థానిక నాయకుల సాయంతో భోజనాలను పంపించారు. రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్నవారికి అల్లా కృప కటాక్షాలు ఉండాలని వారు ఆకాంక్షించారు.