KRNL: పెద్దకడబూరులోని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ చాటారు. ఇంటర్ సెకండ్ ఇయర్లో 87 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 75 మంది ఉత్తీర్ణులయ్యారు. దీంతో 86 శాతం నమోదైంది. ఇందులో మహాలక్ష్మి 974 మార్కులతో టాపర్గా నిలువగా, ఫస్ట్ ఇంటర్లో 122 మంది పరీక్షలు రాయగా 94 మంది ఉత్తీర్ణులు కాగా, పార్వతమ్మ 454 మార్కులతో టాపర్గా నిలిచింది.