GNTR: కోర్టు కేసుల పురోగతిపై దృష్టి సారించాలని గుంటూరు ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. శనివారం కోర్టు కానిస్టేబుళ్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. సకాలంలో ఛార్జిషీట్లు దాఖలు చేయాలన్నారు. సాక్షులకు బెదిరింపులుంటే అధికారుల దృష్టికి తేవాలన్నారు. పెండింగ్ వారెంట్లు, సమన్ల అమలు పక్కాగా ఉండాలి. కేసుల సత్వర పరిష్కారానికి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.