BPT: అద్దంకి మున్సిపల్ కార్మికులకు మార్చి నెల వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. మంగళవారం అద్దంకి మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఏప్రిల్ 21వ తేదీ వచ్చినా జీతాలు అందకపోవడంతో కార్మికులు నిరసన గళం విప్పారు. మార్చి నెల జీతాలు రాకపోవడంతో కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారని సీఐటీయూ మండల కన్వీనర్ తంగిరాల వెంకటేశ్వర్లు అన్నారు.