PLD: రాష్ట్రంలో పీఎం సూర్య ఘర్ కింద 20 లక్షల కనెక్షన్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు. వినుకొండలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తులో విద్యుత్ కోతలు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టామన్నారు. సోలార్ కోసం బీసీలకు రూ. 98 వేలు, వోసీలకు రూ.78 వేల సబ్సిడీ ఇస్తామని చెప్పుకొచ్చారు.