NTR: నందిగామలో “జలధార జలహారతి” కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ జి. లోవరాజు నిర్వహించారు. “స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర” కార్యక్రమంలో భాగంగా నీటి సంరక్షణపై అవగాహన కల్పించారు. భూగర్భ జలాల పెంపుకోసం ఇంకుడు గుంతలు తవ్వించారు. వర్షపు నీటి నిల్వ, నీటి వృథా నివారణపై ప్రజలకు సూచనలు ఇచ్చారు. అధికారులు, సిబ్బంది SASA ప్రతిజ్ఞ చేశారు.