AKP: ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత భూముల తాజా పరిస్థితిని తెలియజేస్తూ నివేదికలను సమర్పించాలన్నారు. పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, రీ సర్వే తదితర అంశాలపై విధివిధానాలను వివరించారు