NLR: పిల్లలకు పరీక్షలు పూర్తయి జూన్ 12 వరకు సెలవులు ఉండటంతో ఇంటిపట్టున ఉండే పిల్లలపై ప్రత్యేక దృష్టి సాధించాలని ఆత్మకూరు ఎస్సై జిలాని శనివారం సూచించారు. పిల్లలు ఇళ్లలో చెప్పకుండా కుంటలు, నది ప్రాంతాలకు వెళ్లి ఈత కొట్టేందుకు వెళ్తుంటారని నీటిలో దిగి ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉందని, తల్లిదండ్రులు ముందస్తుగానే వారి కదిలికలను గమనించాలని అన్నారు.