PPM: క్షయ, మలేరియా జ్వరాలు సకాలంలో గుర్తించి, వ్యాప్తి చెందకుండా నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.భాస్కరరావు స్పష్టం చేశారు. జిల్లా క్షయ విభాగపు సిబ్బంది, మలేరియా సబ్ యూనిట్ అధికారులతో శుక్రవారం ఆరోగ్య కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డా. సూర్య కౌశిక్ పాల్గొన్నారు.