అన్నమయ్య: గాలివీడులో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. మండల కేంద్రంలోని కదిరి రోడ్డులో గుడికి వెళ్లే దారి నుంచి చిన్నేటిగడ్డలోని శ్రీ గాలివీటమ్మ తల్లి ఆలయం వరకు, అక్కడి నుంచి వెలుగు కార్యాలయం వరకు సుమారు రూ. 4,500,000 వ్యయంతో నిర్మించనున్న రోడ్డుకు టీడీపీ నాయకులు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.