KDP: కమలాపురం క్రాస్ రోడ్ వద్ద తాడిపత్రి జాతీయ రహదారిపై ఓ వ్యక్తి మద్యం మత్తులో ఇవాళ నడిరోడ్డుపై పడుకుంటూ వాహనదారులకు ఇబ్బందులు కలిగించాడు. కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఘటనను వీడియోగా చిత్రీకరించగా, అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మద్యం సేవించి ప్రజా రహదారులపై అల్లరి చేయొద్దని పోలీసులు హెచ్చరించారు.