SKLM: లావేరు మండలం బెజ్జిపురం–తమాడ రోడ్డులో ఏర్పాటు చేసిన శ్రీలలిత మోడ్రన్ మినీ రైస్ మిల్ను ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి పరిశ్రమలు అభివృద్ధికి దోహదం చేస్తాయని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన అన్నారు.