KDP: జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలపై పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. గత 24 గంటల్లో 47 కేసులు నమోదు చేసి 47 మందిని అరెస్టు చేశారు. సుమారు రూ.1.20 లక్షల విలువైన 554 క్వార్టర్ బాటిళ్లు, 25 బీర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు.